మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ జంటగా దర్శకుడు సుకు పూర్వాజ్ రూపొందిస్తున్న సినిమా ‘మాటరాని మౌనమిది’. రుద్ర పిక్చర్స్, పీసీఆర్ గ్రూప్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. అర్చన అనంత్, సుమన్ శెట్టి, సంజీవ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. థ్రిల్లింగ్ లవ్స్టోరి కథా నేపథ్యంగా ఉండనుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఇటీవల ఈ సినిమా నుంచి ‘దం దం దంపుడు లక్ష్మీ’ అనే లిరికల్ సాంగ్ను విడుదల చేశారు.
ఈ పాటను అషిర్ లూక్ స్వరపర్చగా..డి సయ్యద్ బాషా సాహిత్యాన్ని అందించారు. రేవంత్, మనీషా పాండ్రంకి, యువరాహుల్ కనపర్తి పాడారు. ఈ ప్రత్యేక గీతంలో జస్ప్రీత్ కౌర్ ఆడిపాడారు. దర్శకుడు సుకు పూర్వాజ్ మాట్లాడుతూ..‘థ్రిల్లింగ్ అంశాలతో కూడిన ప్రేమ కథా చిత్రమిది. ఇందులో మాస్కు నచ్చేలా ఈ ప్రత్యేక గీతాన్ని రూపొందించాం, సినిమాకు ఈ పాట ఆకర్షణ అవుతుందని ఆశిస్తున్నాం. ఇటీవల మా సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్స్కు మంచి స్పందన వస్తున్నది’ అని చెప్పారు.