Raviteja-Gopichandh Malineni | టాలీవుడ్ సక్సెస్ ఫుల్ కాంబోలలో రవితేజ-గోపిచంద్ మలినేని కాంబో ఒకటి. వీళ్ల కాంబోలో వచ్చిన సినిమాలన్ని బంపర్ హిట్లే. డాన్ శీనుతో మొదలైన వీళ్ల జర్నీ బలుపు, క్రాక్ సినిమాల వరకు వచ్చింది. ఈ మూడు సినిమాలు ఒకదానికి మించి మరొకటి బ్లాక్బస్టర్ హిట్లయ్యాయి. నిర్మాతల పాలిట కనకవర్షాలు కురిపించాయి. ఇక ఇప్పుడు ఈ కాంబో నాలుగోసారి చేతులు కలపనుంది. మైత్రీ బ్యానర్పై రవితేజ-గోపిచంద్ మలినేని నాలుగో ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు తాజాగా అఫీషియల్ ప్రకటన వచ్చింది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇక చాలా రోజుల తర్వాత ధమాకాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన రవితేజ.. అదే జోష్తో వాల్తేరు వీరయ్యతో ఈ ఏడాది తొలిహిట్టు ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన రావణాసుర కమర్షియల్గా నిరాశపరిచిన.. రవన్న నటనకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం రవితేజ నాలుగు ప్రాజెక్ట్లను లైన్లో ఉంచాడు. అందులో టైగర్ నాగేశ్వరరావు దసరా స్లాట్ను బుక్ చేసుకుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక దీనితో పాటుగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈగల్ సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా లెవల్లో విడుదల కానున్నాయి.
After a hat-trick of Blockbusters, the MASSIEST COMBO of MASS MAHARAJA @RaviTeja_offl and director @megopichand is back again 🔥🔥🔥
Here’s the Motion Poster of #RT4GM ❤🔥❤🔥
– https://t.co/28TOnFWlBO#MassiestComboisBack
A @MusicThaman Musical 💥 pic.twitter.com/UJqjxp8s2x
— Mythri Movie Makers (@MythriOfficial) July 9, 2023