రవితేజ కొంతకాలంగా వరుసగా యాక్షన్ సినిమాలే చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆయన రూట్ మార్చి ఫుల్లెంగ్త్ కామెడీ సినిమా చేయబోతున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే…‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కబోతున్నది. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుంది.
ఈ సినిమా ఆసాంతం వినోద ప్రధానంగా సాగుతుందని చెబుతున్నారు. ఇందులో రవితేజ దొంగ పాత్రలో కనిపిస్తారని, ఆయన పాత్రను తీర్చిదిద్దిన విధానం చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు. ‘జాతిరత్నాలు’ తరహాలో ప్రేక్షకులకు పూర్తిస్థాయి వినోదాన్ని పంచే కథాంశమిదని సమాచారం. ఈ సినిమాలో రవితేజ సరసన కన్నడ భామ రుక్మిణి వసంత్ కథానాయికగా నటించనుందని వార్తలొస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ తుదిదశలో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంలో నటిస్తున్నారు. అది పూర్తయిన వెంటనే అనుదీప్ దర్శకత్వం వహించే చిత్రం పట్టాలెక్కనుంది.