ముంబై : ఫ్యాషన్ డిజైనర్, నటి మసాబా గుప్తా, నటుడు సత్యదీప్ మిశ్రా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తమ వివాహానికి సంబంధించిన న్యూస్ను నటి తన సోషల్ మీడియాలో వెల్లడిస్తూ పెండ్లికి సంబంధించిన కొన్ని అందమైన ఫొటోలను పోస్ట్ చేశారు. నా ప్రశాంత సాగరంతో వివాహమైంది..జీవితకాలానికి సరిపడా ప్రేమ, ప్రశాంతత, నిలకడ లభిస్తుందని అన్నింటికంటే ముఖ్యంగా తమ జీవితాల్లో నవ్వులు పూయించే ఘట్టం ఆవిష్కృతమైందని అంటూ ఆమె రాసుకొచ్చారు.
సత్యదీప్, మసాబా శుక్రవారం వివాహం చేసుకున్నారని, కోర్ట్ వెడ్డింగ్ ద్వారా ప్రేమికులు ఒక్కటయ్యారని వోగ్ పేర్కొంది. కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా పెండ్లి జరిగిందని మసాబా న్యూ బ్రైడల్ కలెక్షన్ ధరించామని, ఈ కలెక్షన్ తమ వెడ్డింగ్తోనే లాంఛ్ అయిందని మసాబా చెప్పుకొచ్చారు.
త్వరలో తమ ఫ్రెండ్స్, కుటుంబసభ్యులకు గ్రాండ్ పార్టీ ఇస్తామని మసాబా తెలిపారు. మసాబా గుప్తా ప్రముఖ నటి నీనా గుప్తా, వివియన్ రిచర్డ్స్ కూతురు.