Cinema News | రావు రమేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకుడు. ఈ సినిమాలో అంకిత్, రమ్య పసుపులేటి జంటగా నటిస్తున్నారు. వినోదాత్మక కుటుంబ కథా చిత్రంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రావు రమేష్ కొడుకు పాత్రలో అంకిత్ నటించారు. ఆయన ప్రేయసిగా రమ్య పసుపులేటి కనిపించనుంది.
ఈ ప్రేమికుల జంట మీద తెరకెక్కించిన ‘మేడమ్ సార్ మేడమ్ అంతే’ అనే పాటను ఇటీవల విడుదల చేశారు. ‘ఈ సినిమాలో అల్లు అర్జున్ అభిమానిగా అంకిత్ కనిపిస్తారు. హీరోయిన్ ఇంట్రడక్షన్ సన్నివేశంలో అల్లు అర్జున్ సినిమాలోని పాటను గుర్తుకు తెస్తూ ప్రేమగీతాన్ని ఆలపిస్తాడు. ఆ సందర్భంలో వచ్చే పాట ఇది’ అని చిత్రబృందం పేర్కొంది. సిధ్శ్రీరామ్ ఆలపించిన ఈ పాటకు కల్యాణి నాయక్ బాణీలను సమకూర్చగా భాస్కరభట్ల సాహిత్యాన్నందించారు. ఈ చిత్రానికి కెమెరా: ఎం.ఎన్.బాల్రెడ్డి, నిర్మాతలు: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య, కథ, స్క్రీన్ప్లే, సంభాషణలు, దర్శకత్వం: లక్ష్మణ్ కార్య.