ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప మానియా నడుస్తుంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన పుష్ప చిత్రం రెండు పార్ట్లుగా తెరకెక్కగా, తొలి పార్ట్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ఫస్ట్ షో చూడాలని ఫ్యాన్స్తో పాటు సెలబ్స్ సైతం ఆసక్తి చూపుతున్నారు. తాజాగా దర్శకుడు మారుతి తన ట్విట్టర్ ద్వారా హైదరాబాద్లో ఎర్లీ షో టిక్కెట్ కావాలని ట్వీట్ చేశాడు. అంతేకాదు అల్లు అర్జున్, సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ లని కూడా ట్యాగ్ చేశాడు.
అయితే మారుతి ట్వీట్కి స్పందించిన రాశీ ఖన్నా.. ‘కష్టం సార్.. నేను కూడా ట్రై చేస్తున్నా’ (నవ్వుతున్న ఎమోజీతో) అని రిప్లై ఇచ్చింది. ట్విట్టర్ వేదికగా సరదాగా వీరిద్దరి సంభాషణ సాగగా, ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. బన్నీకి అత్యంత ఆత్మీయుడైన మారుతికి సినిమా టికెట్ దొరకకపోవడం ఏంటి? విడ్డూరం కాకపోతే.. అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మారుతి ప్రస్తుతం గోపిచంద్, రాశీ ఖన్నా ప్రధాన పాత్రలలలో పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో సక్సెస్ ఫుల్ బ్యానర్లుగా అందరి మన్ననలు అందుకుంటూ మందుకు సాగతున్న జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ కలిసి చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇటీవల చిత్ర టీజర్ విడుదల కాగా, ఇది అందరిని ఎంతగానో అలరించింది.