Mark Antony Movie | చాలా ఏళ్ల తర్వాత విశాల్ నటించిన ‘మార్క్ ఆంటోని’ సినిమా గురించి ఆడియెన్స్ మాట్లాడుకుంటున్నారు. ‘అభిమన్యుడు’ తర్వాత విశాల్ నుంచి అన్నీ రొట్ట సినిమాలే వచ్చాయి. ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రేక్షకులను థియేటర్ల వరకు రప్పించలేకపోయాయి. అయితే మార్క్ ఆంటోని మాత్రం కొత్త ప్రయత్నంలా అనిపిస్తుందని టీజర్, ట్రైలర్లతో క్లారిటీ వచ్చేసింది. మరీ ముఖ్యంగా మొన్న రిలీజైన ట్రైలర్ మాత్రం ఊహించని స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకులు సైతం ట్రైలర్ను రెండు, మూడు సార్లు రిపీటెడ్గా చూశారంటే.. ట్రైలర్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో తెలుస్తుంది. ఇక మేకర్స్ సైతం తెలుగులో ఈ సారి భారీ రేంజ్లో సినిమాను ప్రమోట్ చేసే దిశాగా అడుగులు వేస్తున్నారు.
కోలీవుడ్కు సమానంగా టాలీవుడ్లో అప్డేట్లు అందిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫోర్త్ సింగిల్కు సంబంధించిన అప్డేట్ను ప్రకటించారు. వీరభద్ర సామి అంటూ సాగే ఉగ్రరూపమెత్తించే సాంగ్ను సెప్టెంబర్ 9న సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. జీవి ప్రకాష్ కుమార్ ఈ పాటకు స్వరాలు అందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన అన్ని పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు ఈ పాట కూడా ఆ లిస్ట్లోకి చేరుతుందని మేకర్స్ తెలుపుతున్నారు. ఇక విశాల్కు జోడీగా ఈ సినిమాలో రీతూవర్మ, అభినయలు నటిస్తున్నారు. తమిళంతో పాటు, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Happy to announce release of the fourth single from #MarkAntony on Sep 9th at 6:30 PM #KaruppanaSaamy in Tamil &#VeerabhadraSaamy in Telugu #MarkAntonyFromSep15#WorldOfMarkAntony pic.twitter.com/z5bxcBcGUT
— Vishal (@VishalKOfficial) September 7, 2023