Mark Antony | ఎన్నో ఏళ్ల తర్వాత విశాల్ మార్క్ ఆంటోని సినిమాతో బంపర్ హిట్టు కొట్టాడు. రోటీన్ మాస్ మసాలా ఫార్ములాను పక్కన పెట్టి ఈ సారి కొంచెం కొత్తగా ట్రై చేసి సక్సెస్ అయ్యాడు. హిట్టంటే మళ్లీ ఆశా మాశీ హిట్టు కాదు. కెరీర్లోను బిగ్గెస్ట్ హిట్టు కొట్టాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలాంటి పోటీ లేకుండా గణేష్ వీక్ను బాగా క్యాష్ చేసుకుంది. కథ కొంచెం కన్విన్సింగ్గా అనిపించకపోయినా.. S.J. సూర్య నటన, సెకండ్ ఆఫ్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైనమెంట్తో నిండి ఉండటంతో సినిమాకు అదిరిపోయే టాక్ వచ్చింది. రిలీజైన వారంలోనే తమిళనాట బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని వీర విహారం చేస్తుంది. తెలుగులోనూ ఈ సినిమా మంచి కలెక్షన్లనే రాబట్టింది.
తాజాగా ఈ సినిమా వంద కోట్ల క్లబ్లో అడుగపెట్టింది. విశాల్ కెరీర్లో వంద కోట్ల మైలు రాయిని టచ్ చేసిన తొలి సినిమాగా మార్క్ ఆంటోని నిలిచింది. ఒక ఫోన్ ద్వారా గతంలోని వ్యక్తులతో మాట్లాడే కాన్సెప్ట్తో ఈ సినిమా తెరకెక్కింది. టైమ్ ట్రావెల్ కథకు మాస్ టచప్ ఇచ్చి అధిక్ రవిచంద్రన్ మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు. తెలుగులో యావరేజ్గానే ఆడింది కానీ.. తమిళంలో ఇప్పటికీ థియేటర్ రన్ కొనసాగుతుంది. మంగళవారం కూడా ఈ సినిమాకు తమిళనాట డీసెంట్ కలెక్షన్లు నమోదయ్యాయి. ఇక ఇటీవలే ఈ సినిమాను హిందీలోనూ రిలీజ్ చేశారు. ఐతే అక్కడ సెన్సార్ కోసం లంచం ఇవ్వాల్సి రావడంపై విశాల్ ఫిర్యాదు చేయడం.. సోషల్ మీడియాలో దీని గురించి పోస్ట్ పెట్టడం హిందీనాట పెద్ద సంచలనం అయింది.