మాజీ ప్రపంచసుందరి మానుషి చిల్లర్ తన తాజా చిత్రం ‘బడే మియా చోటే మియా’ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నది. ఇందులో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ‘కొన్ని పరిస్థితులు గొప్ప అకాశాలను కూడా వదులుకునేలా చేస్తాయి. నిజానికి సందీప్రెడ్డి వంగా ‘కబీర్సింగ్’లో నేనే చేయాలి. అప్పుడు నేను మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకొని ఫెస్టివల్ మూడ్లో ఉన్నాను. ఆ సమయంలో ‘కబీర్సింగ్’ కాల్ వచ్చింది. పూర్తి వివరాలు తెలుసుకోకుండానే ‘నో’ చెప్పేశాను. ఆ తర్వాత తెలిసింది. అది షాహిద్కపూర్ సినిమా అని. చాలా బాధ పడ్డాను. సినిమా చూశాక ఇంకా బాధ అనిపించింది. సందీప్రెడ్డి వంగా గ్రేట్ డైరెక్టర్. ఆయన అభిమానిని అయిపోయాను. సందీప్ సినిమాలో చాన్స్ వస్తే మాత్రం వదులుకోను.’ అంటూ చెప్పుకొచ్చింది మానుషి. ఇంకా చెబుతూ ‘ ‘యామిమల్’ ఎక్స్లెంట్ మూవీ. అందులో రష్మిక చేసిన గీతాంజలి కేరక్టర్ నన్ను కొన్ని రోజులపాటు హంట్ చేసింది. ఆ పాత్రను సందీప్ అద్భుతంగా డిజైన్ చేశారు. కుటుంబంలో కలతలు వచ్చినప్పుడు గీతాంజలి ధైర్యంగా నిలబడిన తీరు సూపర్. రష్మికలోని గొప్ప నటిని ఆవిష్కరించిన సినిమా ‘యానిమల్’. కెరీర్లో అలాంటి పాత్రలు చేయాలని ఉంది’ అంటూ తన కోరికను వ్యక్తం చేసింది మానుషి చిల్లర్.