మనోజ్ నందం, ఫణి చక్రవర్తి, కృష్ణ తేజ, సోనీ రెడ్డి, మనీషా, మౌనిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘వెల్కమ్ టు తీహార్ కాలేజ్’. ఈ చిత్రాన్ని శ్రావ్య ఫిలింస్ పతాకంపై డాక్టర్ ఎల్ఎన్ రావు, యక్కలి రవీంద్రబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకుడు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది.
ఈ సందర్భంగా దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..‘ఇంటర్ విద్యా బోధనలో కొన్ని కళాశాలలు విద్యార్థులను హాస్టళ్లలో ఖైదు చేసినట్లు వ్యవహరిస్తున్నాయి. ఈ అంశాన్ని నేపథ్యంగా తీసుకుని వినోదాత్మకంగా చూపిస్తున్న క్యాంపస్ చిత్రమిది. ర్యాంకుల పోటీలో నలిగిపోతున్న యువత అంతరంగాన్ని కథలో చెబుతున్నాం. సరదాగా ఉంటూనే ఆలోచింపజేసే సినిమా అవుతుంది’ అన్నారు. ‘మన విద్యా వ్యవస్థ లోపాలను చూపించే చిత్రమిది. ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులు చూడాలి’ అని హీరో మనోజ్ నందం అన్నారు.