బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పాయ్, దర్శకుడు నీరజ్ పాండే మళ్లీ జట్టుకడుతున్నారు. మనోజ్ను డిఫరెంట్గా చూపించడంలో నీరజ్కు మంచి రికార్డు ఉంది. పదేండ్ల కిందట వచ్చిన ‘స్పెషల్ 26’, ఐదేండ్ల క్రితం విడుదలైన ‘అయ్యారీ’ సినిమాలు వీరి కాంబోలో వచ్చినవే! ‘స్పెషల్ 26’లో అక్షయ్ కుమార్ హీరోగా నటించినా.. మనోజ్ బాజ్పాయ్ పాత్ర ఇప్పటికీ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దాడు నీరజ్. ఆ తర్వాత వచ్చిన ‘అయ్యారీ’ వీళ్ల జోడీ కలిస్తే అద్భుతం ఆవిష్కృతం అవుతుందని నిరూపించింది.
మళ్లీ ఐదేండ్ల గ్యాప్ తర్వాత ఈ జంట ప్రాజెక్టు పట్టాలెక్కబోతున్నది. ఇప్పటికే స్క్రిప్ట్ పనిలో ఉన్న నీరజ్ ఇటీవల మనోజ్ను కలవడం బీ టౌన్లో హాట్ టాపిక్గా మారింది. ‘ఒకవైపు సినిమాలు, మరోవైపు ఓటీటీ సిరీస్లతో మనోజ్ చాలా బిజీగా ఉంటున్నాడు. ఇన్నాళ్లకు సమయం కుదిరింది. త్వరలోనే ఓ మంచి ప్రాజెక్టు చేపట్టబోతున్నామ’ని నీరజ్ ప్రకటించాడు. దీంతో మనోజ్ అభిమానులు ఈ చిత్రం ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.