‘మా ఊరి ప్రేమకథ’ చిత్రంలో హీరోగా నటించిన మంజునాథ్ నటించనున్న మరో నూతన చిత్రం జనవరిలో ప్రారంభం కానుంది. మంజునాథ్ స్వీయ దర్శకత్వంలో లక్ష్మీదేవి, యస్వీ మహేంద్ర సంయుక్తంగా నిర్మించనున్నారు. మంజునాథ్ మాట్లాడుతూ ‘విలేజ్ నుంచి సిటీకి వచ్చిన ఒక నిరుపేద యువకుడి జీవితం అనుకోని పరిణామాల వల్ల ఎలాంటి మలుపు తిరిగింది అనేది చిత్ర కథ.
జనవరిలో రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభిస్తాం’ అన్నారు. నయామీ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హరీష్.