Manjummel Boys |చిన్న సినిమాగా విడుదలై మలయాళంలో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్’ (Manjummel Boys). తాజాగా ఈ చిత్రం మరో అరుదైన రికార్డును నమోదు చేసింది. కలెక్షన్ల పరంగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన తొలి మలయాళ సినిమాగా ‘మంజుమ్మెల్ బాయ్స్’ రికార్డులకెక్కింది. అంతకుముందు ఈ రికార్డు ‘2018’ సినిమా పేరిట ఉంది. ఈ చిత్రం 2022లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ.175 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఇక 2018 రెండో స్థానంలో ఉండగా.. మోహన్లాల్ సినిమాలు ‘పులిమురుగన్’ ‘లూసిఫర్’ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
సర్వైవల్ థ్రిల్లర్గా వచ్చిన ఈ సినిమాను చిదంబర్ పీ పొదువల్(Chidambaram S Poduval) దర్శకత్వం వహించగా.. సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భసి, బాలు వర్గీస్, గణపతి, సీనియర్ నటుడు లాల్, అరుణ్ కురియన్, ఖలిడ్ రెహ్మాన్, అభిరామ్ రాధాకృష్ణన్, దీపక్ పరంబోల్, షెబిన్ బెన్సన్, లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు.
With around $8M+ from Overseas alone & ₹130crs from Home, #ManjummelBoys has surpassed #2018Movie, Globally Grossed ₹200crs+, still counting.
1st #Malayalam film entering ₹200crs club.. this is a MAMMOTH feat ☄️💣💥❣️
Hearty Congratulations Team !🎉 pic.twitter.com/j6KEMJQDrc— Girish Johar (@girishjohar) March 20, 2024
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 2006లో తమిళనాడు కొడైకెనాల్లోని గుణ గుహలలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించబడింది. ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ గుణ గుహలను సందర్శించడానికి వెళ్లగా ఆ గ్యాంగ్లో ఒకరు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోతాడు. అయితే అతడిని కాపాడేందుకు అతని స్నేహితులు చేసిన రెస్క్యూ ఈ సినిమా స్టోరీ. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ ఘటనపై సినిమా రావడంతో ప్రేక్షకులు కాసులు వర్షం కురిపిస్తున్నారు.