Actress Manjima Mohan | ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మంజిమా మోహన్. ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా లీలా పాత్రలో మంచి నటన కనబరిచింది. ఇక ఇటీవలే ఈమె నటించిన ‘ఎఫ్ఐఆర్’ రిలీజై బ్లాక్బస్టర్ విజయం సాధించింది. ఇదిలా ఉంటే ఈ కేరళ కుట్టి తాజాగా ప్రేమలో ఉన్నట్లు ప్రకటించింది. కోలీవుడ్ హీరో గౌతమ్ కార్తిక్తో లవ్లో ఉన్నట్లు తెలిపింది. వీరిద్దరూ కలిసి 2019లో దేవరత్తం అనే సినిమాలో కలసి నటించారు. అప్పటి నుండి వీళ్ళ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. కాగా స్నేహం కాస్త ప్రేమగా మారింది. తాజాగా మంజిమా తన రిలేషన్ను సోషల్ మీడియాలో వెల్లడించింది.
‘మూడేళ్ల క్రీతం నా జీవితంలో అడుగుపెట్టావు. లైఫ్ను ఎలా చూడాలో నేర్పించావు. దిక్కుతోచని పరిస్థుతులెదురైన ప్రతీసారి అందులో నుండి నన్ను బయటకు తీసుకొచ్చావు. నాలోని లోపాలను అంగీకరించి, నాలా నేనుండాలని నేర్పించావు. నువ్వు నాపై కురిపించే ప్రేమ వల్లే నీపై కొండంత ప్రేమను పెంచుకొన్నాను. ఇప్పుడే కాదు.. ఎప్పటికీ నా జీవితంలో అత్యంత ఇష్టమైన వ్యక్తివి నువ్వే’ అంటూ మంజీమా మోహన్ ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. దీనిపై పలువురు సినీ సెలబ్రెటీలు స్పందించి ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కాగా వీళ్ళద్దరూ ప్రేమలో ఉన్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే వాటిపై మంజిమా మోహన్ స్పందించి అలాంటిది ఏమి లేదని, నిజంగా లవ్లో పడితే కచ్చితంగా చెప్తానంది. ఇక ఇన్నాళ్ళకు తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. ప్రస్తుతం మంజిమా దక్షిణాదిలో పలు ప్రాజెక్ట్లతో బిజీగా ఉంది. ఇక కడలి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ కార్తిక్.. కోలీవుడ్లో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.