మణిరత్నం దర్శకత్వంలో కమల్హాసన్ నటించిన ‘నాయకన్’ (తెలుగులో ‘నాయకుడు’) చిత్రం ఆల్టైమ్ క్లాసిక్స్లో ఒకటిగా నిలిచిపోయింది. 37 ఏండ్ల విరామం తర్వాత ఈ ఇద్దరి లెజెండ్స్ కలయికలో ‘థగ్లైఫ్’ పేరుతో చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పీరియాడిక్ కథాంశంతో భారీ మల్టీస్టారర్గా ఈ సినిమా రానుంది. ఇటీవల ఓ అవార్డు వేడుకలో పాల్గొన్న మణిరత్నం ‘థగ్లైఫ్’ చిత్రం గురించి మాట్లాడారు.
కమల్హాసన్తో సినిమా తీయడానికి 37 ఏళ్ల విరామానికి గల కారణాలను వివరించారు. ‘కమల్హాసన్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయనతో సినిమా తీయాలంటే భారీ హంగులున్న కథ అవసరం. అది ఆయన స్థాయికి సరిపోవాలి. అందుకే ఇన్నేళ్లు వేచిచూశాను. ‘థగ్లైఫ్’ కమల్ స్థాయికి తగిన కథ. ఈ సినిమాతో మేం మరోసారి చరిత్ర సృష్టించబోతున్నాం’ అని చెప్పారు మణిరత్నం. కొద్ది మాసాల క్రితం విడుదల చేసిన ‘థగ్లైఫ్’ ఫస్ట్లుక్కు మంచి స్పందన లభించింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. రాజ్కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ పతాకాలపై కమల్హాసన్, మణిరత్నం, ఆర్.మహేంద్రన్, శివ అనంత్ నిర్మిస్తున్నారు.