ముంబై : సినీ నటి, టీవీ వ్యాఖ్యాత మందిరా బేడీ భర్త, సినీనిర్మాత రాజ్ కౌశల్ మృతిచెందారు. ఇవాళ తెల్లవారుజామున 4.30 గంటలకు ఆయనకు గుండెపోటు వచ్చింది. రాజ్ కౌశల్ మృతిపట్ల బాలీవుడ్ ప్రముఖులు నివాళి అర్పించారు. ఇంట్లో ఉన్న సమయంలోనే ఆయనకు హార్ట్ అటాక్ వచ్చిందని, కుటుంబసభ్యులు వైద్య చికిత్స కోసం ప్రయత్నించారని హీరో రోహిత్ శెట్టి తెలిపారు. మందిరా బేడీ, రాజ్ కౌశల్కు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ప్యార్ మే కబీ కబీ, షాదీ కా లడ్డూ, ఆంథోనీ కౌన హై చిత్రాలను ఆయన తీశారు. కాపీ రైటర్గా రాజ్ కౌశల్ తన కెరీర్ను ప్రారంభించారు. సుభాష్ ఘాయ్, ముకుల్ ఆనంద్ వద్ద ఆయన పనిచేశారు. 1998లో అడ్వర్టయిజింగ్ కంపెనీని ప్రారంభించారు. సుమారు 800 కమర్షియల్ యాడ్స్ను ఆయన తీశారు.