Manchu vishnu | మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తిరుపతిలో మన్యంరాజు పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడాడు. సినిమా టికెట్ల ధరలపై సినీ పరిశ్రమ ఏకతాటిపైకి రావాలని, చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం మేరకు ముందుకెళ్తామని విష్ణు అన్నాడు. విడిగా మాట్లాడి సమస్యను పక్కదారి పట్టించలేను, రెండు ప్రభుత్వాలతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తాం. రెండు ప్రభుత్వాలు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాయని వెల్లడించాడు.
చిరంజీవి ,జగన్ మీటింగ్ను అసోసియేషన్ మీటింగ్గా భావించకూడదని అది వాళ్ళిద్దరి వ్యక్తిగత సమావేశం అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. టికెట్లపై వైఎస్ హయాంలోనే జీవో వచ్చిందని..ఆ జీవో పై చర్చ జరగాలని ఆయన వెల్లడించాడు. తనను విమర్శిస్తున్నారంటే తను పాపులర్ అని అర్థం అంటూ పెర్కొన్నాడు. ఇండస్ట్రీ ఒక్కరిది కాదని,ప్రతి ఒక్కరిది అని..స్వలాభం కోసం ఎవరూ పరధి దాటి మాట్లాడొద్దన్నారు. మా అసోసియేన్ 100రోజుల ప్రగతిపై త్వరలోనే మాట్లాడుతా అని చెప్పారు.