Manchu Family Issue | టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో సమస్యలు మళ్లీ మొదటికి వచ్చాయి. గత కొన్ని రోజులుగా కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటుండడం తెలుగు రాష్ట్రాల్లో చర్చాంశనీయంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదం సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో మరోసారి వివాదం మొదలైంది. ఇటీవల సంక్రాంతి వేడుకల్లో మంచు విష్ణుతో కలిసి మోహన్ బాబు కూడా పాల్గోనగా.. ఈ పండుగ వేళ మంచు మనోజ్ ( Manchu Manoj), తన భార్యతో కలిసి మోహన్బాబు వర్సిటీకి రావాడం ఉద్రిక్తతకు దారి తీసింది.
మనోజ్ దంపతులను లోపలికి అనుమతించక పోవడంతో ఆయన అనుచరులు గేటు పైకి ఎక్కి లోపలికి ప్రవేశించారు. మనోజ్కు అనుమతి లేదని వారు చెప్పడంతో ఇరువర్గాల వారు దూషణకు దిగారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య గొడవ కూడా జరిగింది. అయితే ఈ విషయంలో తనపై , భార్య మౌనికపై దాడులకు పాల్పడ్డారంటూ మంచు మనోజ్ చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు అనుమతులు లేకుండా తన వర్సిటీలోకి చొచ్చుకు వచ్చేందుకు మనోజ్ ప్రయత్నించారని మోహన్బాబు పీఏ చంద్రశేఖర్ నాయుడు పోలీసు స్టేషన్లో మరో ఫిర్యాదు చేశాడు.
దీంతో ఫిర్యాదులను పరిశీలించిన పోలీసులు ఇరువురిపై కేసు నమోదు (Cases Register) చేశారు. పీఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదుతో నమోదైన కేసులో ఏ-1గా మనోజ్, ఏ-2గా మౌనిక, మరో ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా మనోజ్ ఫిర్యాదు కేసులో ఏ-1గా విజయ్ సింహా, ఏ-2 గా సురేంద్ర, మరో 7గురిపై కేసులు నమోదు చేశామని వివరించారు.
అయితే తాజాగా ఈ ఘటనపై మంచు విష్ణు ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఇంట్రెస్టింగ్ వీడియోను పంచుకున్నాడు. మంచు విష్ణు, మోహన్ బాబు ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం రౌడీ. ఈ సినిమాకు ఆర్జీవీ దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమాలోని ఒక డైలాగ్ను మనోజ్ని ఉద్దేశించి పోస్ట్ చేశాడు విష్ణు. ‘సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగటానికి.. అడవిలో గర్జించటానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ’ అంటూ ఈ డైలాగ్ని పోస్ట్ చేశాడు విష్ణు.
One of my fav movie and dialogue from #Rowdy. @RGVzoomin is one of my fav and he rocked this movie. Every dialogue in this is a statement. Celebrating #MB50 pic.twitter.com/AZToFJ1eKM
— Vishnu Manchu (@iVishnuManchu) January 17, 2025