కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నట వారసులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విష్ణు, మనోజ్ తమ పంథాలో దూసుకుపోతున్నారు.ఈ ఇద్దరు హీరోలకు ఇటీవలి కాలంలో సరైన సక్సెస్లు రాకపోవడంతో సినిమాలు తగ్గించేశారు. మంచు విష్ణు మా ఎలక్షన్స్లో అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు సన్నద్ధం అవుతుండగా, మనోజ్ .. అహం బ్రహ్మాస్మి అనే సినిమా చేస్తున్నాడు.
మంచు విష్ణు.. రీసెంట్గా ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరయ్యాడు.ఆ షోలో మనోజ్తో నీకు ఏవో గొడవలున్నాయని బయట ప్రచారం నడుస్తుంది అని ప్రశ్నించగా, దానికి విష్ణు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యాడు. వేసుకున్న కోటు కూడా విప్పేస్తూ పర్సనల్ విషయాలు వాళ్లకెందుకు అంటూ చెప్పేసాడు విష్ణు. అక్క లక్ష్మి వేరుగా ఉంటుంది.. అలాగే తమ్ముడు మనోజ్ కూడా వేరుగానే ఉంటాడు. నేను నాన్నతో ఉంటున్నా.. అంతే తప్ప అడ్డమైన పుకార్లకి సమాధానం చెప్పాను అంటూ క్లారిటీ ఇచ్చాడు విష్ణు.
మా రిలేషన్ గురించి తప్పుడు ప్రచారాలు చేసే వారికి సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదన్నాడు విష్ణు. కాగా, దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మంచు మనోజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అహం బ్రహ్మాస్మి’ చిత్ర షూటింగ్ ఆగిపోయిందని, మనోజ్ త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్టు జోరుగా ప్రచారం సాగగా, దానిపై స్పందించిన మనోజ్.. ‘ఇలాంటి పుకార్లు వ్యాప్తి చేయకండి అన్నో.. వేసవి నుంచి మన సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. యాక్షన్ అని చెప్పకముందే కట్ చెప్పొద్దు’ అని మనోజ్ పేర్కొన్నారు.మంచు మనోజ్ ఆర్ట్స్, విద్యానిర్వాణ మంచు ఆనంద్ సమర్పణలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పాన్ ఇండియా స్థాయితో ఈ సినిమా విడుదల కానుంది.