కథానాయకుడు మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ చిత్రంను శ్రీకాళహస్తిలో ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. త్వరలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ‘స్టార్ప్లస్లో ప్రసారమైన మహాభారత సిరీస్కు దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకుడు. మంచు విష్ణు సరసన హీరోయిన్గా కృతిసనన్ సోదరి నుపుర్ సనన్ నటిస్తారు.
ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్బాబు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. త్వరలో షూటింగ్ మొదలుపెట్టి సింగిల్ షెడ్యూల్లో చిత్రాన్ని పూర్తిచేస్తామని, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుండి అగ్ర నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నట్లు , రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయిమాధవ్, తోట ప్రసాద్ ఈ కథకు కీలక మెరుగులు దిద్దుతున్నారని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ, స్టీఫెన్ దేవా.