పోస్టల్ బ్యాలెట్ విషయంలో తాను కుట్ర చేస్తున్నానని ప్రకాష్రాజ్ చేసిన ఆరోపణల్ని మంచు విష్ణు ఖండించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ “అరవై ఏళ్లు పై బడిన వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పిస్తామని ఎన్నికలు సంఘం చెప్పింది. ‘మా’లో అరవై సంవత్సరాలకు పై బడిన వారు 160 మంది ఉన్నారు. వారందరికి నేను స్వయంగా ఫోన్ చేసి పోస్టల్ బ్యాలెట్ కావాలా? అని అడిగి తెలుసుకున్నా. పోలింగ్ కేంద్రానికే వచ్చి ఓటు వేస్తామని వందమందికి పైగా చెప్పారు. ఇతర రాష్ర్టాల్లో ఉన్నవారు పోస్టల్ బ్యాలెట్లో వేస్తామని చెప్పారు. వాళ్లు ఎన్నికల అధికారికి లెటర్ ఎలా రాయాలో తెలియజేస్తూ నేను ఓ ఫార్మాట్ను పంపించా. ఆ లెటర్స్ను వాళ్లే స్వయంగా కొరియర్లో ‘మా’ ఆఫీస్కు పంపించారు. ప్రకాష్రాజ్ చెబుతున్నట్లు కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే లెటర్లను తీసుకురాలేదు. ప్రకాష్రాజ్ అహంకారి. ‘మా’అసోసియేషన్ను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు’ అని విష్ణు ఆరోపించారు.