Manchu Mohan Babu | మంచు ఫ్యామిలీ వివాదం తర్వాత సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే తాను నటించిన ఆల్ టైం క్లాసిక్ సినిమాలను అభిమానులతో పంచుకుంటున్నాడు. ఇప్పటికే మోహన్ బాబు నటించిన శివరంజని (Sivaranjani) సినిమాతో పాటు కలెక్టర్ గారు(Collector Garu) సినిమాలకు సంబంధించిన విశేషాలను పంచుకున్న మోహన్ బాబు తాజాగా చిరంజీవితో కలిసి నటించిన ‘పట్నం వచ్చిన పతివ్రతలు'(Patnam Vachina Pativrathalu) సినిమాకు సంబంధించిన జ్ఞాపకాలను ఎక్స్ వేదికగా పంచుకున్నాడు.
నా సినీ ప్రయాణంలో 1982లో వచ్చిన ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎంతో ప్రతిభావంతుడైన మౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నా పాత్ర ఎంతో సంతృప్తిని కలిగించిందని మోహన్ బాబు అన్నారు. ముఖ్యంగా నా ప్రియమైన స్నేహితుడు చిరంజీవితో స్క్రీన్ పంచుకోవడం.. ఆయనకు అన్నగా నటించడం.. ప్రత్యేక అనుభుతిని మిగిల్చిందని మోహన్ బాబు అన్నారు. నా మూవీ కెరీర్లో మర్చిపోలేని చిత్రాల్లో ఒకటిగా ఇది నిలిచి పోతుందని తెలిపారు. 1982లో వచ్చిన ఈ చిత్రం మోహన్ బాబు, చిరంజీవి కెరీర్లో మైలురాయిగా నిలిచింది.
Patnam Vachina Pativrathalu (1982) holds a special place in my journey. Directed by the talented Sri. Moulee, I truly cherished portraying my role, especially sharing the screen with my dear friend, Sri. Chiranjeevi, as brothers. This movie remains one of the most unforgettable… pic.twitter.com/fBU68OVpR9
— Mohan Babu M (@themohanbabu) December 20, 2024