కథానాయకుడు మంచు మనోజ్ కరోనా బారిన పడ్డారు. కొవిడ్ పరీక్షలో తనకు పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు బుధవారం ట్విట్టర్ ద్వారా ఆయన వెల్లడించారు. తన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని తెలిపారు. ‘కొవిడ్ పరీక్షలో నాకు పాజిటివ్గా తేలింది. గత వారం రోజులుగా నన్ను కలిసిన వారందరూ తప్పకుండా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నా. కరోనాను ఎదుర్కొనే పోరాటంలో ప్రతి ఒక్కరూ విధిగా అవసరమైన జాగ్రత్తలన్ని పాటించండి. మీ అందరి ఆశీర్వాదాలు, ప్రేమ వల్ల నేను క్షేమంగా ఉన్నా. నా ఆరోగ్యం విషయంలో ఎవరూ భయపడాల్సిన పనిలేదు’ అని మంచు మనోజ్ తెలిపారు.
బోనీకపూర్ కుటుంబంలో కరోనా కలకలం
బాలీవుడ్లో కరోనా కలవరాన్ని సృష్టిస్తున్నది. గత కొంతకాలంగా పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతుండటం ఆందోళనను కలిగిస్తుంది. తాజాగా హీరో అర్జున్ కపూర్తో పాటు ఆయన కుటుంబసభ్యులు కరోనా బారిన పడ్డారు. అర్జున్ కపూర్, ఆయన సోదరి అన్షులాకపూర్, అనిల్ కపూర్ తనయ రియాకపూర్, ఆమె భర్త కరణ్ భులానిలకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. బోనీకపూర్, అనిల్కపూర్ స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. అయితే కొవిడ్ పరీక్షలో వారికి నెగెటివ్గా ఫలితం వచ్చింది. ‘పలు జాగ్రత్తలు తీసుకున్నా కరోనా బారిన పడ్డాం. నా భర్తతో పాటు నేను ఐసోలేషన్లో ఉన్నా. వైద్యుల సంరక్షణలో అవసరమైన చికిత్సను తీసుకుంటున్నాం. మా ఆరోగ్యం విషయంలో అనవసరమైన పుకార్లను ప్రచారం చేయవద్దని కోరుతున్నా’ అని రియాకపూర్ చెప్పింది.