నిరంజన్, గ్రీష్మ నేత్రికా, ప్రియ, దీప్తి శ్రీరంగం ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న హారర్ కామెడీ చిత్రం ‘రుక్మిణి’. సింహాచలం గుడుపూరి దర్శకుడు. నేలబల్లి సుబ్రహ్మణ్యంరెడ్డి, కట్టా గంగాధరరావు నిర్మాతలు. త్వరలో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ని విడుదల చేశారు. హీరో మంచు మనోజ్ ఈ టీజర్ని లాంచ్ చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
ఈ సినిమాలో నటించడం పట్ల ప్రధాన పాత్రధారులంతా ఆనందం వెలిబుచ్చారు. సాంకేతికంగా అన్ని విధాలా సినిమా ఆకట్టుకుంటుందని, పనిచేసిన అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా ఇదని నిర్మాత కట్టా గంగాధర్రావు నమ్మకంగా చెప్పారు. నిర్మాతల సహకారం వల్లే ఈ సినిమా ఇంతబాగా వచ్చిందని, త్వరలోనే థియేట్రికల్ రిలీజ్ కానున్నదని దర్శకుడు సింహాచలం గుడిపూరి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, సమర్పణ: నేలబల్లి కుమారి, నిర్మాణం: జీ సినిమా.