బిగ్ బాస్ హౌజ్ లో శ్రీరామ్, కాజల్ మధ్య జరిగిన డిస్కషన్ తర్వాత సన్నీ.. ఆ ఇద్దరిని కలిపే ఉద్దేశం చేశాడు. శ్రీరామ్ మాత్రం కాజల్తో మాట్లాడేందుకు ఇష్ట పడలేదు. అనంతరం టాప్-5లో ఎవరు ఉంటారు? అని గార్డెన్ ఏరియాలో కూర్చొన్న షణ్ముఖ్ను శ్రీరామ్ అడగ్గా, ‘వేరే వాళ్ల సంగతి నాకు తెలియదు. నేను, సిరి ఉంటాం’ అని సమాధానం ఇచ్చాడు.
ఫ్రెండ్స్కు ఇవ్వకుండా ఓటు అడిగే అవకాశం మానస్ తనకు ఎలా ఇచ్చాడా? అని శ్రీరామ్తో షణ్ముఖ్ అన్నాడు. ప్రియాంక వెళ్లిపోయిన తర్వాత అతను అందరితో కలుస్తున్నాడని చెప్పుకొచ్చాడు. ‘అనాల్సినవన్నీ అనేసి ఆ తర్వాత ఏదైనా అంటే కాజల్ ఏడుస్తుంది’ అని శ్రీరామ్ చెప్పుకొచ్చాడు. మరోవైపు కిచెన్లో కూర్చొన్న సన్నీ, మానస్ మాట్లాడుకుంటూ ‘టాప్-6 ర్యాంకులు ఇచ్చినప్పుడు చెప్పిన కారణాలు నాకు నచ్చలేదు’ అని మానస్ అన్నాడు.
‘గెలిచిన, ఓడినా వీళ్లు నిజాయతీగా ఆడారన్న పేరు వస్తే చాలు. వీళ్ల గురించి ఆలోచించకు’ అనిసన్నీ మానస్కి హితబోధ చేశాడు. కాళ్లకు గాయాలు అయి, ఇబ్బంది పడిన శ్రీరామ్కు వేళకు మందులు ఇచ్చి సపర్యలు చేసిన కృతజ్ఞత కూడా లేకుండా శ్రీరామ్ ప్రవర్తించాడని, హౌస్లో యూజ్ అండ్ త్రో బ్యాచ్ ఎక్కువగా ఉంది అంటూ మానస్ అభిప్రాయపడ్డాడు. మొత్తానికి కాజల్ పెట్టిన పుల్ల వలన హౌజ్ వేడెక్కిపోయింది.