ఆదివారం జరిగిన ఫన్ కార్యక్రమంలో బిగ్ బాస్ హౌజ్మేట్స్తో సరదా గేమ్స్ ఆడించాడు నాగార్జున. ఇందులో భాగంగా నోట్లో నీళ్లు పోసుకుని పాటలు పాడాలి. దాన్ని మిగతా టీం సభ్యులు కనిపెట్టాల్సి ఉంటుంది. ఈ ఆటలో సన్నీ, కాజల్, ప్రియాంక ఓ టీం. సిరి, షన్ను, మానస్ మరో టీంగా ఉన్నారు. ఇక శ్రీరామచంద్రను సంచాలక్గా ఉన్నాడు. ఇందులో సిరి టీం విజయం సాధించింది.
ఈ గేమ్ పూర్తైన తర్వాత కాజల్ సేఫ్ అయినట్టు ప్రకటించాడు నాగార్జున. ఇక తర్వాత లూడో అనే గేమ్ ఆడించాడు. ఇందులో సిరి కోసం షన్ను, కాజల్ కోసం సన్నీ, ప్రియాంక కోసం మానస్ డైస్ థ్రో చేశారు. ఇందులో రెడ్ వస్తే పనిష్మెంట్, గ్రీన్ వస్తే సేఫ్.. బ్లూ అయితే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నాడు నాగార్జున. ఈ క్రమంలో మానస్ పిల్లోతో రొమాన్స్ చేయాలని నాగ్ ఆదేశించాడు. కానీ ఆచరణలో మానస్ విఫలమయ్యాడు.
దిండుతో ఎలా రొమాన్స్ చేయడమని అతడు ఎదురు ప్రశ్నించగా పోనీ ప్రియాంకతో రొమాన్స్ చేస్తావా? అని సూటిగా అడిగేశాడు నాగ్. దీంతో షాకైన మానస్ వద్దు, దిండే నయమని ఫీలైనప్పటికీ అందరూ పట్టుబట్టి మరీ పింకీతో రొమాన్స్ చేయించారు. అప్పుడు కూడా అతను ఏ మాత్రం రొమాన్స్ చేయలేకపోయాడు. ఓ సారి సన్నీ వేసిన డైస్కు పనిష్మెంట్ వచ్చింది.
సన్నీకి మేకప్ వేయమని నాగ్ టాస్క్ ఇచ్చాడు. గేమ్ మొత్తం అయిపోయే వరకు అలానే మేకప్తో ఉండాలని నాగ్ అన్నారు. ఇక హౌస్లో కామన్సెన్స్లేని వ్యక్తులు ఇద్దరున్నారని వారెవరో కాదు.. సిరి, పింకీ అని చెప్పుకొచ్చాడు షణ్ను. లూడో గేమ్లో సన్నీ, కాజల్ గెలిచారు.