Jr. NTR – Mookambika Temple | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం కర్ణాటక పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఫ్యామిలీతో కలిసి మంగళూరు వెళ్లిన తారక్.. అక్కడ ఉన్న ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్నారు. ఇక తారక్తో పాటు అతడి వెంట నటుడు రిషబ్ షెట్టితో పాటు సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఉండడం విశేషం.
ఇక శనివారం తన అమ్మ కోరిక మేరకు ఉడిపిలోని శ్రీకృష్ణ మఠంను దర్శించుకున్న తారక్ ఆదివారం కొల్లురులోని మూకాంబిక అమ్మవారి ఆలయానికి వెళ్లారు. ఉదయంపై పంచెకట్టులో ఆలయానికి వెళ్లిన తారక్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక తారక్తో పాటు నటుడు రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ కూడా మూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా దీనికి సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.
A Special visit today from the Man of Masses @tarak9999, his family and @shetty_rishab to the Kolluru Sri Mookambika Temple 🙏🏻🙏🏻 pic.twitter.com/p5Wcx9d3yE
— BA Raju’s Team (@baraju_SuperHit) September 1, 2024
Ntr