Yatra 2 | 2019లో ఏపీ (పూర్వ ఆంధ్రప్రదేశ్) దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి స్టోరీ నేపథ్యంలో వచ్చిన బయోపిక్ యాత్ర (Yatra). మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి కొనసాగింపుగా యాత్ర 2 (Yatra 2) వస్తుందని తెలిసిందే. తాజాగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిజ జీవితంలో చోటుచేసుకున్న ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సీక్వెల్ అప్డేట్ వచ్చేసింది.
ఫస్ట్ పార్టులో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించగా.. సెకండ్ పార్టులో మమ్ముట్టి, జీవా లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్లో యాత్ర 2 షూటింగ్ షురూ అయింది. మమ్ముట్టి తాజా షెడ్యూల్లో జాయిన్ అయినట్టు మేకర్స్ తెలియజేశారు. తాజా షెడ్యూల్లో మమ్ముట్టి, జీవాపై వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు సమాచారం. కాగా త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.
ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాను Three Autumn Leaves, V Celluloid సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. సీక్వెల్కు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. 2024 ఫిబ్రవరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. యాత్ర 2కు సంబంధించిన మరిన్ని వివరాలపై రాబోయే రోజుల్లో క్లారిటీ ఇవ్వనుంది టీం.
యాత్ర 2 షూటింగ్ స్టిల్..
Shooting on progress!#Yathra2@mammukka #Mammootty#Yatra2 #KannurSquad #kathalthecore #Bramayugam #Bazooka #Bilal pic.twitter.com/PvQHGdqFec
— കിമോത്തി അൽബാനി (@Junaidjunu3698) September 22, 2023