బాలీవుడ్ నటి మందిరా బేడి భర్త రాజ్ కౌశల్ రీసెంట్గా గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన ఆకస్మిక మరణంతో మందిరా బేడి గుండె బద్ధలైంది. ఆయన మృతిని అస్సలు జీర్ణించుకోలేకపోయింది. భర్తపై ప్రేమతో ఆయన చితికి మందిరానే అంతమ సంస్కారాలు చేసింది. అయితే ఆ సమయంలో మందిరా జీన్స్ , టీషర్ట్ ధరించి ఉండడంతో ఆమెపై విమర్శలు గుప్పించారు.
భర్త ఇక లేరు అనే విషయాన్ని తలచుకొని కుమిలిపోతున్న మందిరా బేడి తాజాగా ఉద్వేగ భరితమైన ట్వీట్ చేశారు. నా రాజీ.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నువ్వు లేని నా హృదయం బద్ధలైంది అని ఎమోషనల్ కామెంట్ చేశారు. కాగా సినీ దర్శకుడు రాజ్ కౌశల్(49) జూన్ 30న గుండెపోటుతో మరణించిన విషయం విదితమే. రాజ్ కౌశల్- మందిర 1999లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 2011లో వీరికి వీర్ జన్మించాడు. తార అనే బాలికను దత్తత తీసుకున్నారు.