Malla Reddy | విద్యా రంగంలో అనేక సంస్థలను స్థాపించి గుర్తింపు తెచ్చుకున్న మల్లారెడ్డి ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిగా సేవలందించారు. ప్రస్తుతం మేడ్చల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయన, తన ప్రత్యేకమైన స్పీచ్తో సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతూ ఉంటారు. మల్లారెడ్డికి సినీ పరిశ్రమతో కూడా మంచి అనుబంధం ఉంది. గతంలో ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారనే వార్తలు పలుమార్లు వినిపించాయి. ముఖ్యంగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో విలన్ పాత్రను ఆఫర్ చేసినా, మల్లారెడ్డి ఆ అవకాశాన్ని తిరస్కరించినట్లు వెల్లడించారు.
ఇటీవల ఆహా ఓటీటీ వేదికలో ప్రసారమవుతున్న ‘సర్కార్’ షోలో పాల్గొన్న మల్లారెడ్డి, తన సినీ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విలన్ పాత్రను ఎందుకు చేయలేదో వివరించిన ఆయన, “విలన్గా చేస్తే ఫస్ట్ హాఫ్లో హీరోను నేను తిడతాను, సెకండ్ హాఫ్లో హీరో నన్ను కొడతాడు. అలా చేస్తే నా విద్యార్థులు, ప్రజల ముందు బాగోదు” అని అన్నారు.అయితే సినిమాల్లోకి రాకూడదనే నిర్ణయం తీసుకోలేదని, మంచి పాత్ర వస్తే తప్పకుండా ఆలోచిస్తానని తెలిపారు. తనకు చిరంజీవి ఎంతో ఇష్టమైన హీరో అని చెప్పిన ఆయన, భవిష్యత్తులో తన జీవిత కథ ఆధారంగా బయోపిక్ చేయాలనే ఆలోచన ఉందని వెల్లడించారు.
నా కథతో సినిమా తీస్తే, నేను తానే నిర్మాతగా వ్యవహరిస్తా. నా పాత్రకు సరిపోయే హీరోను దర్శకుడు ఎంపిక చేస్తాడు. నేను కూడా ఆ సినిమాలో నటిస్తా అని చెప్పడంతో మల్లారెడ్డి బయోపిక్పై ఊహాగానాలు మొదలయ్యాయి.ఈ వ్యాఖ్యలతో మల్లారెడ్డి త్వరలోనే సినీ పరిశ్రమలోకి నిర్మాతగా అడుగుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజకీయాల్లోనే కాకుండా వినోద రంగంలో కూడా తనదైన ముద్ర వేయాలనే ప్రయత్నంగా ఇది భావిస్తున్నారు.