Pradeep kottayam | మాలయాళ నటుడు ప్రదీప్ కొట్టాయం మరణించాడు. ఈయన ఆకస్మిక మరణం మాలయాళ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈయన మలయాళంతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లో కూడా నటించారు. తెలుగులో నాగచైతన్య నటించిన ఏమాయ చేశావే చిత్రంలో జార్జ్ అంకుల్ పాత్రలో నటించాడు. తమిళ డబ్బింగ్ రూపంలో వచ్చిన రాజారాణి, పోలీసోడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించాడు. ప్రదీప్ ఇప్పటి వరకు 80 పైగా చిత్రాలతో పాటు సీరియల్లో కూడా నటించాడు.
ఈయన మరణం పట్ల ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విచారం వ్యక్తం చేశాడు. ‘ఆడు ఒరు భీగర జీవి ఆను’, ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’, ‘లైఫ్ ఆఫ్ జోసుట్టి’, ‘కుంజిరామాయణం’, ‘వెల్కమ్ టు సెంట్రల్ జైలు’ వంటి మలయాళ సినిమాల్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన మోహన్ లాల్ ‘ ఆరట్టు’ సినిమాలో నటించాడు. ఈ చిత్రం ఫిబ్రవరి18న విడుదలకానుంది.
Rest in peace! #KottayamPradeep 🙏 pic.twitter.com/zUHU2GflqH
— Prithviraj Sukumaran (@PrithviOfficial) February 17, 2022