Vinu | భారతీయ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ మళయాల దర్శకుడు విను (69) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా ఆయన ఆరోగ్య సంబంత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దర్శకుడు విను చాలా కాలంగా ఉదర సంబంధిత వ్యాధితో బాధపడుతూ.. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు.
మరో దర్శకుడు సురేష్తో కలిసి విను ‘మంగళం వీట్టిల్ మానసేశ్వరి గుప్తా’ చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహించారు. ఇందులో వాణీ విశ్వనాథ్, జయరామ్ ప్రధాన పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్రశంసలు అందుకున్నది. ఆ తర్వాత సురేశ్-వినుగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ‘కుశృతికాటు’కి దర్శకత్వం వహించారు.
మనోజ్ కె జయన్ ప్రధాన పాత్రలో నటించిన ‘కణిచుకులంగరైల్ సీబీఐ’లో సురేష్-విను చివరిగా పనిచేశారు. అలాగే విను పలు చిత్రాలకు గాత్రదానం చేశారు. వినుకు భార్య అనురాధ రాధాకృష్ణన్, పిల్లలు నిమిశ్, మోనికా ఉన్నారు. కోయంబత్తూరులోని సింగనల్లూర్ శ్మశానవాటికలో గురువారం ఉదయం 10.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు.