ఉప్పెన సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ తన తొలి సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక రెండో సినిమాగా క్రిష్ దర్శకత్వంలో కొండ పొలం అనే సినిమా చేశాడు. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా రూపోందించారు దర్శకుడు క్రిష్. రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.
గిరిజనుల జీవితాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను కేవలం 40 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశారట. వికారాబాద్ ఫారెస్ట్లో ఎక్కువ శాతం చిత్రీకరించారు. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ను ఆహా స్ట్రీమింగ్ సంస్థ దక్కించుకుంది. కీరవాణి సంగీతాన్ని అందించిన ఈ సినిమా, ఇటీవల కర్నూల్లో ఆడియో ఫంక్షన్ జరుపుకుంది. నిన్న హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది.
అక్టోబర్ 8న చిత్రం విడుదల కానుండగా, మేకర్స్ మూవీపై భారీ అంచనాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ క్రమంలో మేకింగ్ వీడియో ఒకటి విడుదల చేశారు.ఇందులోని సన్నివేశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక ఈ సినిమాలోని 7 పాటలు కూడా జనంలోకి దూసుకుపోయాయి. కీరవాణి .. సిరివెన్నెల .. చంద్రబోస్ రాసిన పాటలు జనం మనసులకు పట్టేశాయి. ‘ఓబులమ్మా’ .. ‘శ్వాసలో’ .. ‘చెట్టెక్కి’ పాటలకు విశేషమైన ఆదరణ లభిస్తోంది.