‘ఆదిపురుష్’ చిత్రంపై విడుదల రోజు నుండి విమర్శలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సినీ రంగానికి చెందిన సీనియర్ నటులు, దర్శకులతో పాటు పలువురు ఈ చిత్రం తెరకెక్కించిన విధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రామాయణకథను తమ ఇష్టానుసారంగా, సినిమా కోసం వక్రీకరించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ చిత్రంలోని సంభాషణలపై కూడా పలు విమర్శలు వచ్చాయి.ఈ సినిమాలోని సంభాషణలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని దేశవ్యాప్తంగా పలువురు ఆరోపించారు. ముఖ్యంగా లంకా దహనం సందర్భంలో హనుమాన్ పాత్రధారి చెప్పిన డైలాగ్స్పై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆ సంభాషణలను మార్చారు. కొత్తడైలాగ్స్తో సినిమాను ప్రదర్శిస్తున్నట్లుగా చిత్రబృందం తెలియజేసింది. ప్రభాస్, కృతిసనన్ రాఘవ జానకి పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఓంరౌత్ దర్శకత్వం వహించారు.