Major Movie | ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన నటన, అభినయంతో ప్రేక్షకులలో విపరీతమైన అభిమానాన్ని ఏర్పరచుకున్న నటుడు అడవి శేష్. టాలీవుడ్లో థ్రిల్లర్ కథలకు కెరాఫ్ అడ్రెస్గా శేష్ నిలిచాడు. లేటెస్ట్గా ఈయన నటించిన చిత్రం ‘మేజర్’. ముంబై బాంబు దాడుల్లో అమరవీరుడైన మేజర్ సందీప్ ఉన్నీ కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ‘గూఢచారి’ ఫేం శశికిరణ్ టిక్కా దర్శకత్వం వహించాడు. ఇదివరకే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ గ్లింప్స్, ట్రైలర్ ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలు నమోదు చేశాయి. యాక్షన్ థిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్లను మొదలు పెట్టారు. తాజాగా ఈ చిత్రం నుంచి బిగ్ అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు.
మేజర్ చిత్ర బృందం లేటెస్ట్గా బిగ్ అప్డేట్ను ప్రకటించింది. ఈ చిత్రాన్ని పది రోజుల ముందుగానే ప్రివ్యూస్ వేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. మే24న హైదరాబాద్తో పాటు, బెంగళూరు, కొచ్చి, ముంబై, పూణె, అహ్మదాబాద్, జై పూర్, ఢిల్లీ, లక్నో వంటి 9 సిటీలలో ఈ సినిమా ప్రీవ్యూస్ ప్రదర్శితం కానుంది. దీనికోసం చిత్ర బృందం బుక్ మై షో ద్వారా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రివ్యూస్ చూడాలనుకునే వారు ‘బుక్ మై షో’లో టిక్కెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. విడుదలకు పది రోజుల ముందు సినిమా ప్రివ్యూ వేయడం అనేది ఇండియన్ సినిమాలో ఇదే మొదటి సారి. ఇంత వరకు హాలీవుడ్ సినిమాలు విడుదలకు పది నుంచి నెల రోజుల ముందు ప్రివ్యూలను వేసి సినిమాపై బజ్ను క్రియేట్ చేస్తారు. ఇక హాలీవుడ్ సినిమాల స్ట్రాటజీను మేజర్ చిత్రం ఇండియాలో ప్రయోగం చేయనుంది.
జీఎంబీ ఎంటర్టైనమెంట్స్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ+ఎయస్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. శోభితా ధూళిపాల కీలకపాత్రలో నటించింది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
HERE it is!!! MASSIVE! For the FIRST TIME EVER!#MAJOR
X@bookmyshow pic.twitter.com/so2fTAx4Y6— Adivi Sesh (@AdiviSesh) May 23, 2022