Major movie | కరోనా కారణంగా వాయిదా పడ్డా సినిమాలన్ని ఒక్కొక్కటిగా విడుదల తేదీలను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే రాధేశ్యామ్, ట్రిపుల్ఆర్, భీమ్లానాయక్, ఆచార్య, సర్కారువారి పాట వంటి పెద్ద సినిమాలతో పాటు మీడియం రేంజ్ సినిమాలు తమ తమ విడుదల తేదీలను ప్రకటించాయి. తాజాగా మహేష్బాబు నిర్మాణంలో అడవిశేష్ హీరోగా నటించిన మేజర్ చిత్రం కూడా సినిమా విడుదలతేదిని ప్రకటించింది. 26/11 ముంబై దాడుల్లో వీరమరణం పొందిన ఎన్ఎస్జీ కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. గూఢాచారి ఫేం శశికిరణ్ టిక్కా ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా అడివిశేష్ కథ స్క్రీన్ప్లే అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మే27 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
మేజర్ చిత్రాన్ని ముందుగా ఫిబ్రవరి 11న విడుదలచేయాలని చిత్ర యూనిట్ భావించింది. కాని కరోనా కారణంగా వాయిదాపడింది. ఇప్పటికే పెద్ద సినిమాలన్నీ రానున్న రెండు మూడు నెలల్లో విడుదలకానున్నాయి. ఈ నేపథ్యంలో వేసవి అయితేనే మంచి సమయమని భావించి దర్శక నిర్మాతలు మే 27వ తేదిని ఫిక్స్ చేశారట. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న మేజర్ చిత్రాన్ని సోని పిక్చర్స్ సమర్పణలో A+S మూవీస్ సంస్థతో కలిసి మహేష్బాబు తన సొంత బ్యానర్పై నిర్మిస్తున్నాడు. ఇప్పటికే చిత్ర బృందం విడుదలచేసిన ప్రచారచిత్రాలు,టీజర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచుతున్నాయి. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సాయిమంజ్రేకర్, శోభితా దూలిపాళ్ళ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
THIS. SUMMER. WILL. BE.
MASSIVE.#MajorTheFilm WORLDWIDE on 27 May, 2022 🔥🔥#MAJOR ka promise hai Yeh. #MajorOnMAY27 pic.twitter.com/aky5skkJee
— Adivi Sesh (@AdiviSesh) February 4, 2022