Mahesh Babu | ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు. దాదాపు రెండున్నరేళ్ళ తర్వాత మహేష్బాబు వెండితెరపై కనిపించడంతో అభిమానుల సంతోషానికి అవదుల్లేకుండా పోయాయి. గతవారం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. రీజినల్ చిత్రాలలో వేగంగా 100కోట్ల షేర్ను సాధించిన హీరోగా మహేష్రికార్డు సృష్టించాడు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మళ్ళి ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ చిత్రానికి పరుగులు తీస్తున్నారు. ఇక ఇప్పట్లో సర్కారోడి పాట ఆగేలా లేదు. మే 27న విడుదల కానున్న ‘ఎఫ్-3’ వరకు ఈ చిత్రానికి ఎలాంటి పోటీ లేదు. ఇక పోతే ఈ చిత్రం తర్వాత మహేష్, త్రివిక్రమ్తో సినిమా చేయనున్నాడు.
ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. ఇక మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. కాగా కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మహేష్ సినిమాలకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ రావడం ఆనవాయితీగా ఉంది. ఈ క్రమంలోనే ఈ సారి మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన టైటిల్ను మేకర్స్ అధికారికంగా ప్రకటించబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో సమాచారం. అంతే కాకుండా రాజమౌళితో చేయబోతున్న సినిమా గురించి కూడా ఏదో ఒక అప్డేట్ రానున్నట్లు టాక్. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ‘ఖలేజా’, ‘అతడు’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులే కాదు సినీప్రముఖులలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మహేష్కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది.