Maheshbabu-Trivikram movie | సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబోలుంటాయి. వీళ్ల నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకులలో అంచనాలు విపరీతంగా పెరిగిపోతాయి.ఇప్పటికే ఇలాంటి కాంబోలలో బన్నీ-సుకుమార్, బాలయ్య-బోయపాటి లు ప్రేక్షకులు ఊహించినట్టుగానే పుష్ఫ అఖండతో బ్లాక్ బాస్టర్ హిట్లను సాధించారు. ఇక ఈ కోవలోకే మరో కాంబో హ్యట్రిక్ కు సిద్దమైంది. ఆ కాంబోనే మహేష్ బాబు-త్రివిక్రమ్. వీళ్లిద్దరు కలిసి అతడు ,ఖలేజా సినిమాలకు పనిచేశారు. అతడు కలెక్షన్స్ పరంగా హిట్ కాగా ఖలేజా టెలివిజన్ పరంగా హిట్ అయ్యింది. ఇక వీళ్ల కాంబోలో వస్తున్న హ్యట్రిక్ చిత్రం #SSMB28 ఇంకా టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఫిబ్రవరి 3 న హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు.మార్చిలో రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు. థమన్ సంగీత సారథ్యంలో రూపోందుతున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే, సంయుక్త మీనన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇక మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నారు. పరుషరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించనున్నాడు. ఇక ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రంలోని లవ్ ట్రాక్ ను విడుదలచేయనున్నట్లు చిత్ర బృంద తెలిపింది. ఇక త్రివిక్రమ్ ప్రస్తుతం బీమ్లానాయక్ సినిమాకు మాటలు-స్రీన్ ప్లే తో పాటు దర్శకత్వ పర్యవేక్షకుడిగా పనిచేస్తున్నాడు.సితార ఎంటర్టైనమెంట్స్ పతాకం పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నాడు.