Maheshbabu-trivikram project | చిత్ర పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లు ఉంటాయి. ఈ కాంబోలపై ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలుంటాయి. అలాంటిదే మహేశ్బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్. ఇప్పటికే వీళ్ల కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలు క్లాసిక్స్గా నిలిచాయి. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి హ్యట్రిక్ కు రెడీ అయ్యారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పూజాకార్యక్రమాలు నేడు హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోస్లో గ్రాండ్గా ప్రారంభమయ్యాయి. ఈచిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందించనుండగా పూజాహెగ్డే ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మార్చి నుండి ప్రారంభంకానున్నట్లు మేకర్స్ తెలిపారు.
మహేష్బాబు ప్రస్తుతం సర్కారువారి పాట చిత్రంలో నటిస్తున్నాడు. గీతాగోవిందం ఫేం పరుషురాం ఈచిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, 14రీల్స్ సంస్థలతో కలిసి మహేష్బాబు స్వయంగా నిర్మిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈచిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.
#SSMB28 formally launched with pooja.#SSMB28FirstClap #MaheshBabu pic.twitter.com/JLHEbJgPlc
— Manobala Vijayabalan (@ManobalaV) February 3, 2022