సూపర్ స్టార్ మహేష్, ఒకప్పటి అందాల హీరోయిన్ నమ్రతల గారాల పట్టి గౌతమ్ ఈ రోజు 15వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా మహేష్ అభిమానులతో పాటు ఇండస్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.మహేష్ బాబు తన తనయుడితో దిగిన పిక్ షేర్ చేస్తూ.. గౌతమ్కి చూస్తుండగానే పదిహేను ఏళ్లు వచ్చేశాయి అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశాడు.
ఇక సితార కూడా తన ఇన్స్టాగ్రామ్లోతన అన్నయ్యతో కలిసి దిగిన పిక్స్ షేర్ చేస్తూ బర్త్ డే శుభాకంక్షలు తెలిపింది. మహేష్ బాబు తన కొడుక గౌతమ్ కృష్ణతో ‘నేనొక్కడినే’ సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే కదా. గౌతమ్ ఘట్టమనేని తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్ పోటీలో టాప్ 8 ఈతగాళ్ళ లిస్ట్ లో స్థానాన్ని సంపాదించాడని నమ్రత ఆ మధ్య వెల్లడించిన విషయం తెలిసిందే.
బటర్ఫ్లై, బ్యాక్స్ట్రోక్, బ్రెస్ట్స్ట్రోక్ & ఫ్రీస్టైల్ అనే నాలుగు పద్ధతుల్లో గౌతమ్ ఈత కొడతాడని, అతనికి ఫ్రీస్టైల్ అంటే బాగా ఇష్టమని, నీళ్లలో 5 కి.మీ 3 గంటల్లో ఈదగలడని నమ్రత చెప్పుకొచ్చారు