Mahesh-Rajamouli Movie | మహేష్-రాజమౌళి సినిమా కోసం అభిమానులతో పాటు యావత్ ఇండియా మొత్తం అమితాసక్తితో ఎదురు చూస్తుంది. ఇప్పటికే రాజమౌళి స్టోరీ లైన్ చెప్పి సినీ అభిమానుల్లో తిరుగులేని అంచనాలు నెలకొల్పారు. పైగా పాన్ వరల్డ్ రేంజ్ సినిమా అంటూ సోషల్ మీడియా హైప్తోనే మహేష్ అభిమానుల హార్ట్ బీట్ రెండు రెట్లు ఎక్కువగా కొట్టుకుంటుంది. ఇక ఇవన్నీ వింటుంటే సగటు సినీ ప్రేక్షకుడు సైతం ఎప్పుడెప్పుడు ఈ సినిమా మొదలవుతుందా? అని ఎదురు చూస్తున్నాడు. పైగా ఇప్పుడు రాజమౌళి రేంజ్ హాలీవుడ్కు ఎగబాకింది. ఆయన సినిమా కోసం మనమే కాదు మైల్ల దూరంలో ఉన్న పక్క దేశ సినీ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.
కొన్ని నెలలుగా ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. రాజమౌళి తండ్రి విజేయేంద్ర ప్రసాద్ కనీవినీ ఎరుగని రీతిలో కథను సిద్ధం చేస్తున్నాడట. ఈ సినిమాలో మహేష్ ప్రపంచాన్ని చుట్టే మనిషిగా కనిపిస్తాడని రాజమౌళి ఎప్పుడు క్లారిటీ ఇచ్చేశాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా లాంఛింగ్ కార్యక్రమాలు మహేష్ బర్త్డే సందర్భంగా అగస్టు 9న గ్రాండ్గా జరుపనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే దాని కోసం ప్లాన్లు కూడా వేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక నవంబర్లో ఎట్టి పరిస్థుతుల్లో సినిమా షూటింగ్ను మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారట.
ఈ నేపథ్యంలోనే మహేష్ గుంటూరు కారం సినిమాను వేగంగా పూర్తి చేయమని త్రివిక్రమ్కు చెప్పాడట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసరి ప్రాంతాల్లో జరుగుతుంది. గ్యాప్ లేకుండా మహేష్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొననున్నాడట. ఇది పూర్తయిన వెంబటే రాజమౌళి సినిమా మొదలు కానుందని తెలుస్తుంది. పక్కా ప్రణాళికతోనే ఎస్ఎస్ఎమ్బీ 29బృందం రంగంలోకి దిగనుందట. ఇక రైటర్ విజేంద్రప్రసాద్ తాజాగా ఈ సినిమాకు ఓపెన్ ఎండింగ్ ఉంటుందని, సీక్వెల్కు చాన్స్ ఉంటుందని చెప్పి మహేష్ అభిమనుల్లో మరింత జోష్ నింపాడు.