మహేశ్ బాబు నటిస్తున్న 28వ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఈ చిత్రాన్ని హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దర్శకుడు త్రివిక్రమ్ రూపొందిస్తున్నారు. హారికా హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల నాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా హైదరాబాద్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నది.
కీలక నటీనటులు ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. అనుకున్న విధంగా షూటింగ్ పూర్తి చేసి ప్రణాళిక ప్రకారం ఆగస్టు 11న విడుదల చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేసుకుంటున్నది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను ఉగాది సందర్భంగా ఈ నెల 22న విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ‘ఆరంభం’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. ఉగాది పండుగ రోజున ఆ టైటిల్ ఏంటో అఫీషియల్గా వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.