సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) షూటింగ్ ను వేగంగా పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu). గీత గోవిందం ఫేం పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ వచ్చే నెల వరకు పూర్తి కానుంది. మరోవైపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) అయితే మహేశ్ బాబు ఎప్పుడు సినిమా కంప్లీట్ చేస్తాడా..? అని వెయిట్ చేస్తున్నాడు. త్రివిక్రమ్-మహేశ్ కాంబోలో రాబోతున్న #SSMB28కు సంబంధించిన అప్ డేట్ ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
మార్చిలో ఎండల తీవ్రత కొంత తక్కువగా ఉంటుంది. అయితే మే నాటికి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశముండటంతో మహేశ్ బాబు ఆ టైంలో విరామం తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట. పీక్ సమ్మర్లో షూటింగ్కు దూరంగా ఉండాలనుకుంటున్నట్టు లేటెస్ట్ టాక్. భార్యాపిల్లలతో కలిసి వెకేషన్ కు వెళ్లేందుకు రెడీ అవుతున్నట్టు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో జూన్ కానీ, జులైలో కానీ మహేశ్-త్రివిక్రమ్ సినిమా మొదలయ్యే చాన్స్ ఉందట.
ఈ చిత్రంలో పొడుగుకాళ్ల సుందరి పూజాహెగ్డేను ఫీ మేల్ లీడ్ రోల్ కోసం ఫైనల్ చేసింది త్రివిక్రమ్ టీం. పక్కా ఎంటర్ టైనర్గా రాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్ రాధాకృష్ణ నిర్మించనున్నారు. ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడు. సర్కారు వారి పాట నుంచి ఇప్పటికే విడుదలైన కళావతి సాంగ్ టాప్ ట్రెండింగ్లో కొనసాగుతుంది.