Mahesh Babu | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్బాబు (Mahesh Babu) బిగ్సీ 20వ వార్సికోత్సవ సంబురాల్లో (BIG C 20th anniversary) పాల్గొన్నాడు. ఈవెంట్లో భాగంగా చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా మీరూ రోజూ స్మార్ట్ఫోన్ను ఎంత సేపు వినియోగిస్తారని మహేశ్బాబును ఓ రిపోర్టర్ అడిగాడు. దీనికి మహేశ్ బాబు స్పందిస్తూ.. అందరిలాగే చాలా సార్లు వాడతానంటూ రిప్లై ఇచ్చాడు. అయితే ఫోన్ వాడకంతో కొన్నిసార్లు నాకు తలనొప్పి కూడా వస్తుంది. ఆ టైంలో నేను ఫోన్ వాడటం మానేస్తానంటూ చెప్పుకొచ్చాడు.
మరో రిపోర్టర్ మాట్లాడుతూ.. మీరు నిద్రపోయే ముందు, నిద్రలేచిన తర్వాత మీ మొబైల్ను చూసే అలవాటు ఉందా..? అని అడిగాడు. దీనికి మహేశ్ బాబు రిప్లై ఇస్తూ.. అందరూ అలాగే చేస్తున్నారని.. తాను వీలైనంతవరకు ఫోన్ను పక్కన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఇక మీ రింగ్ టోన్ ఎంటి..? అని ప్రశ్నించగా.. సైలెంట్ అని చెప్పుకొచ్చాడు. స్మార్ట్ ఫోన్ గురించి మహేశ్ బాబు ఫన్నీ రియాక్షన్స్ ఇప్పుడు నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్గా మారాయి.
మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో గుంటూరు కారం (Guntur kaaram) చేస్తున్నాడని తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ 28 (SSMB 28)గా వస్తోన్న ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరిఫీ మేల్ లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. గుంటూరు కారం 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.
ఇప్పటికే విడుదల చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ అభిమానులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. మహేశ్ బాబు మరోవైపు స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబీ 29ను కూడా లాంఛ్ చేయబోతున్నాడు. గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్గా రాబోతున్న ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్ కథనందిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అప్డేట్స్ క్లారిటీ ఇవ్వనుంది జక్కన్న టీం.
ఈవెంట్లో మహేశ్ బాబు..
The enchanting smile that never fails to melt us and one that we always love to see… @UrstrulyMahesh ❤️❤️❤️#2DecadesOfBigC #SSMB #MaheshBabu @BigCMobilesIND pic.twitter.com/CPuN0vqgmz
— Mahesh Babu Space (@SSMBSpace) August 20, 2023
గుంటూరు కారం మాస్ స్ట్రైక్..