SSMB 29 | రాజమౌళి దర్శకత్వంలో మహేష్బాబు కథానాయకుడిగా నటించబోతున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ అప్డేట్ కోసం దేశవ్యాప్తంగా అభిమానుల్లో ఆసక్తినెలకొని ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇదే కావడం, ఆయన దర్శకత్వంలో మహేష్బాబు తొలిసారి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ హైప్ క్రియేట్ చేస్తున్నది. ఈ సినిమా ఎప్పుడు లాంచ్ అవుతుందోనని అభిమానులు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. జనవరిలో పట్టాలెక్కనుందని గతంలోనే వార్తలొచ్చాయి.
విశ్వసనీయ సమాచారం ప్రకారం నేడు హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమాను మొదలుపెడతారని తెలిసింది. అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని ఫిల్మ్నగర్ వర్గాల్లో వినిపిస్తున్నది. సాధారణంగా ప్రతీ సినిమా ప్రారంభానికి ముందు ప్రెస్మీట్ పెట్టి ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించడం రాజమౌళి ఆనవాయితీ. మరీ ఈ సినిమా విషయంలో ఆయన అదే పద్దతి ఫాలో అవుతారో లేదో వేచిచూడాల్సిందే. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా కోసం వెయ్యికోట్ల బడ్జెట్ కేటాయించారని వార్తలొస్తున్నాయి. కీరవాణి సంగీతాన్నందించనున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ నిర్మించనున్నారు.