Mahesh Babu | టాలీవుడ్ క్రేజీ కాంబోల్లో ఒకటి మహేశ్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas). అభిమానులు ఈ ఇద్దరి కాంబో ఎప్పుడెప్పుడు థియేటర్లలో సందడి చేస్తుందా..? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ గుంటూరు కారం (Guntur kaaram). అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఎస్ఎస్ఎంబీ 28 (SSMB 28)గా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. తన కెరీర్లో సూపర్ హిట్స్ అందించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు.
మా టాలెంటెడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరం అద్భుతంగా ఉండాలని కాంక్షిస్తున్నట్టు ట్వీట్ చేశాడు మహేశ్బాబు. సెట్స్లో త్రివిక్రమ్తో ఉన్న స్టిల్ను షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. సోమవారం మహేశ్బాబు, శ్రీలీల, రమ్యకృష్ణ, జగపతిబాబుపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరించినట్టు ఫిలింనగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్. గుంటూరు కారంలో మీనాక్షి చౌదరి మరో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. గుంటూరు కారం 2024 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ సినిమాలో మహేశ్ బాబు అభిమానులకు కావాల్సిన ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేస్తోంది. మరోవైపు త్రివిక్రమ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు హీరో రామ్ .
మహేశ్బాబు స్పెషల్ బర్త్డే విషెస్..
Wishing our talented director #TrivikramSrinivas a blockbuster birthday and a spectacular year ahead !! 🤗❤️ pic.twitter.com/QbJsWrQqIE
— Mahesh Babu (@urstrulyMahesh) November 7, 2023
గుంటూరు కారం మాస్ స్ట్రైక్..