మహేష్బాబు కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకుడు. ఈ నెల 12న ప్రేక్షకులముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రచార కార్యక్రమాల వేగం పెంచారు. కుటుంబంతో కలిసి పారిస్ విహార యాత్రలో ఉన్న మహేష్బాబు గురువారం హైదరాబాద్ తిరిగొచ్చారు. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకను ఈ నెల 7న హైదరాబాద్ యూసుఫ్గూడ పోలీస్గ్రౌండ్స్లో నిర్వహించబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు. అభిమానుల సమక్షంలో భారీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని.. ఈ వేడుకలో ప్రేక్షకులకు చాలా సర్ప్రైజ్లు ఉంటాయని చిత్రబృందం పేర్కొంది. ప్రమోషన్లో భాగంగా ట్విట్టర్లో ‘సర్కారు వారి పాట’ ఎమోజీని విడుదల చేశారు.
‘ఇటీవల విడుదలైన ట్రైలర్.. కామెడీ, మాస్, యాక్షన్ అంశాల కలబోతగా అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నది. మహేష్బాబు అభిమానులకు ఓ పండగలా ఉంటుందీ చిత్రం’ అని నిర్మాతలు తెలిపారు. కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్.మది, సంగీతం: తమన్, నిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14రీల్స్ ప్లస్, సీఈఓ: చెర్రీ, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట.