మహేష్బాబు (Mahesh Babu) లీడ్ రోల్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్టు ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata). పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గీతగోవిందం తర్వాత పరశురామ్ (Parasuram) చేస్తున్న సినిమా కావడంతో క్యూరియాసిటీ పెంచుతుందీ చిత్రం. మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లలో విడుదల కాబోతుంది. కాగా విడుదలకు ఇంకో నెల రోజులు సమయం ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.
సర్కారు వారి పాట ప్రచార కార్యక్రమాలను (SVP promotions) వచ్చే వారం నుంచి షురూ చేయబోతున్నట్టు తాజా టాక్. ఇప్పటికే రెండు పాటలు విడుదలై..మంచి స్పందన రాబట్టుకున్నాయి. ఇంకో వారంలో మూడో పాటను కూడా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారట పరశురాం టీం. ఈ పాట విడుదలతో ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
ఇక ట్రైలర్ ఈ నెల చివరలో కానీ, వచ్చే నెల మొదటి వారంలో కానీ విడుదల చేయనున్నారు. మేకర్స్ క్రియేటివ్గా ప్రమోషన్స్ చేయాలని అనుకుంటున్నారని టాక్. బ్యాంక్ స్కాంల నేపథ్యంలో ఈ చిత్రం రాబోతుందని ఇన్ సైడ్ టాక్. కాగా ఈ చిత్రంలో మహానటి ఫేం కీర్తి సురేష్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా..వెన్నెల కిషోర్, సుబ్బరాజు కీ రోల్స్ లో నటిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.