Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం కుటుంబంతో కలిసి వెకేషన్కు వెళ్లిన విషయం తెలిసిందే. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’ షూటింగ్ నుంచి కొద్దిరోజుల విరామం తీసుకున్న మహేష్, సోమవారం (డిసెంబర్ 29) హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారతో కలిసి కనిపించారు.రాజమౌళి సినిమాతో వరుస షెడ్యూల్స్లో బిజీగా ఉన్న మహేష్ బాబు, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఫ్యామిలీతో విదేశీ ట్రిప్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఎయిర్పోర్ట్లో మహేష్ కుటుంబానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే ఎయిర్ పోర్ట్లో మహేష్ బాబు బ్లూ టీ-షర్ట్, బ్రౌన్ జాకెట్, జీన్స్తో పాటు తన ట్రేడ్మార్క్ క్యాప్, కళ్లజోడుతో మహేష్ బాబు స్టైలిష్గా కనిపించారు. కూతురు సితార కూడా వైట్ టీ-షర్ట్, క్యాప్, కూలింగ్ గ్లాసెస్తో తండ్రిని పోలిన లుక్లో మెరిసింది. నమ్రత, గౌతమ్ చిరునవ్వులతో అభిమానులను ఆకట్టుకున్నారు.ఇక తాజాగా మహేష్ బాబు ఫ్యామిలీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పిక్స్ బయటకు రాగా, ఇవి చూసి నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. “ఏమున్నాడురా బాబు” అంటూ కొందరు కామెంట్లు చేయగా, మరికొందరు “నువ్వు సృష్టించే విధ్వంసం కోసం వెయిటింగ్” అంటూ ‘వారణాసి’ సినిమాను గుర్తు చేస్తున్నారు. రాజమౌళి సినిమాల అప్డేట్స్ ఆలస్యంపై ఓ నెటిజన్ సరదాగా, “కానియ్యి అన్నా… ఎలాగో మళ్లీ ఆగస్టులోనే అప్డేట్ వస్తుంది” అంటూ సెటైర్ వేశాడు.
ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘వారణాసి’ అనే టైటిల్ను గత నవంబర్లో హైదరాబాద్లో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్లో అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్ బాబు 2024 నుంచే ప్రత్యేక శిక్షణ ప్రారంభించగా, 2025 జనవరి నుంచి షూటింగ్లో పాల్గొంటున్నారు. భారీ యాక్షన్ అడ్వెంచర్గా రూపొందుతున్న ఈ సినిమా 2027 సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుంది. ఇదిలా ఉండగా, ఇటీవల మహేష్ బాబు క్రిస్మస్ సెలబ్రేషన్స్కు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.