Mahesh babu | స్టార్ హీరో మహేష్ బాబు నటిస్తున్న కొత్త సినిమాకు ‘గుంటూరు కారం’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకుడు. పూజా హెగ్డే, శ్రీలీల నాయికలుగా నటిస్తున్నారు. దివంగత సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా బుధవారం ఈ చిత్ర టైటిల్తో పాటు గ్లింప్స్ను అభిమానుల చేతుల మీదుగా విడుదల చేశారు.
హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో జరిగిన కార్యక్రమంలో అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని సందడి చేశారు. పాట బీజీఎం ఉన్న ఫైట్తో మొదలైన గ్లింప్స్ ‘ఏంది అట్టా జూస్తున్నావ్…బీడీ త్రీడీలో కనబడుతుందా?..’ అంటూ మహేష్ చెప్పిన మాస్ డైలాగ్తో పూర్తయింది. మిర్చి యార్డ్ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తున్నది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.